
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
ఖలీల్వాడి: ప్రమాదవశాత్తు మురికికాలువలో పడి నగరంలోని సీతారాంనగర్ కాలనీకి చెందిన సిద్దులోల్ల మల్లేశ్(76) అనే వ్యక్తి మృతి చెందినట్లు నాల్గోటౌన్ పోలీస్స్టేషన్ ఎస్సై శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో కూరగాయల షాపు నడిపే మల్లేశ్ గురువారం రాత్రి 7.30 గంటలకు సీతారాంనగర్ కాలనీలోని ఇంటి వచ్చాడు. ఆ తరువాత వైన్స్షాపునకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. శుక్రవారం ఉదయం గాయత్రినగర్లోని పద్మశాలి సంఘం వద్ద మురికికాలువలో ప్రమాదవశాత్తు పడి చనిపోయాడు. మృతుడి కుమారుడు ఆనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో..
బాన్సువాడ రూరల్: నిజాంసాగర్ మండలం కొనతండాకు చెందిన దేవసోత్ మోతీలాల్ (48) అనే వ్యక్తి గురువారం రాత్రి తిర్మలాపూర్ శివారులో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బాన్సువాడ మండలంలోని బుడిమి గ్రామంలో తాను పనిచేసే రైస్మిల్లుకు వస్తుండగా ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. మోతీలాల్ ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. మృతుడి భార్య దేవసోత్ లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహన్ తెలిపారు. మృతుడికి కూతురు, కొడుకు ఉన్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి