
పంటమార్పిడితో సుస్థిర ఆదాయం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పంటమార్పిడి ప్రక్రియ చేపట్టడం వల్ల రైతులు సుస్థిర ఆదాయం పొందవచ్చని మండలంలోని మాల్తుమ్మెద ఏరువాకకేంద్రం శాస్త్రవేత్తలు అనిల్రెడ్డి, రేవంత్ అన్నారు. మండలంలోని పోచారం గ్రామంలో గురువారం రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తక్కువ యూరియా వాడడం వల్ల సాగు ఖర్చు తగ్గించుకోవచ్చన్నారు. అవసరం మేరకు రసాయనాలను వినియోగించి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసిన రషీదులను రైతులు భద్రపర్చుకోవాలని, కష్టకాలంలో నష్టపరిహారాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. ఏవో సాయికిరణ్, హెచ్వో కమలాకర్రెడ్డి, హిందూస్థాన్ యూనిలివర్ జనరల్ మేనేజర్ అశోక్, ఫీల్డ్ఆఫీసర్ పరమేశ్వర్రెడ్డి, మాల్తుమ్మెద సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.