సుభాష్నగర్/కామారెడ్డి అర్బన్: దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్న భా రత త్రివిధ దళాల సేవలు మరువలేనివని, వారి సంక్షేమానికి పౌరునిగా చేయూతనంది స్తూ సాయుధ దళాల పతాక నిధికి విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి, కామారెడ్డికి చెందిన కే కృష్ణమూర్తి రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఈ మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి డీ రమేశ్కు ఆయన గురువారం చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి శర్మ దంపతులను శాలువాతో సత్కరించి అభినందించారు.
అనంతరం అధికారి రమేశ్ మా ట్లాడుతూ కృష్ణమూర్తి శర్మను స్ఫూర్తిగా తీసుకొని ఉమ్మడి జిల్లాలోని వ్యాపారులు, ప్రజ లు దేశ రక్షణలో విధులు నిర్వహిస్తున్న సైనికులు, వారి కుటుంబాలకు స్వచ్ఛందంగా విరాళాలు అందించి చేయూతనందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయ సిబ్బంది బదాం గంగామోహన్, ఉమేర్ పాల్గొన్నారు.
భూభారతితో సమస్యలకు పరిష్కారం
రామారెడ్డి: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు భూ భారతితో పరిష్కారమవుతాయని కామారెడ్డి ఆర్డీవో కే వీణ పేర్కొ న్నారు. రామారెడ్డి మండలం కన్నా పూర్లో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రామారెడ్డి తహసీల్దార్ ఉమాలతతో కలిసి ఆర్డీవో వీణ పాల్గొన్నారు. కన్నాపురం గ్రామానికి చెందిన 116 మంది రైతులు భూ సమస్యలపై ఫిర్యాదులు అందజేసినట్లు ఆర్ఐ రవికాంత్ తెలిపారు. విచారణ చేపట్టి ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు.
రక్తదాన శిబిరాల
నిర్వహణలో జిల్లాకు అవార్డు
కామారెడ్డి క్రైం: జిల్లాలో రక్తదాన శిబిరాల నిర్వహణలో జిల్లాకు అవార్డు దక్కింది. దాతల నుంచి రక్తాన్ని సేకరించి పేదల ఆరోగ్య అవసరాలకు వినియోగించేందుకు ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో బ్లడ్ యూనిట్లను అందించినందుకుగాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవార్డును ప్రకటించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈనెల 14వ తేదీన హైదరాబాద్లో నిర్వహించనున్న కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ చేతుల మీదుగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అవార్డును అందుకోనున్నారు. జిల్లా కలెక్టర్తోపాటు నరేంద్ర ఆచార్య మఠ్సంస్థాన్ వారు సైతం అవార్డును స్వీకరించనున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక పథకం కింద డి – అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవో) నుంచి ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి ఏ ప్రమీల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మాదకద్రవ్యాల బారిన పడిన వారిని వ్యసనాల నుంచి బయటకు తీసుకు రావడానికి కృషి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ–అనుధాన్ పోర్టల్లో ఆన్లైన్ ద్వారా దాఖలు చేయాల్సి ఉంటుందని, పూర్తి వివరాలకు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
డైట్లో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు..
కామారెడ్డి అర్బన్: నిజామాబాద్ డైట్ కళాశాలలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు 14 అతిథి అధ్యాపక (గెస్ట్ లెక్చరర్) పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ టి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సొషియాలజీ, సైకాలజీ, సైన్స్, మ్యాథ్స్, సోషల్, తెలుగు, ఫైన్ ఆర్ట్స్, ఫిజికల్ డైరెక్టర్, సోషల్ సైన్స్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత సబెక్ట్ లో పీజీ, ఎంఈడీ చేసిన 65 సంవత్సరాలలోపు వారు ఈనెల 19వ తేదీ వరకు దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంఈడీ లేనిపక్షంలో బీఈడీ చేసిన వారికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు మెరిట్ ప్రాతిపదికన ఇంటర్వ్యూలు నిర్వహించి నియమిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 94404 14198 నంబర్ను సంప్రదించాలని సూచించారు.

సాయుధ దళాల పతాక నిధికి రూ.లక్ష విరాళం