
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి టౌన్: ఈనెల 14వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్లో వీలైనన్ని కేసుల పరిష్కారానికి కృషి చేయాలని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ అన్నారు. కోర్టు భవనంలో న్యాయవాదులతో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాంపౌండబుల్, క్రిమినల్, సివిల్ తదితర కేసులు పరిష్కారం అయ్యేలా ఇరు వర్గాలతో రాజీ కుదుర్చాలని అన్నారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి సుమలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి, జూనియర్ సివిల్ జడ్జి కే సుధాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి దీక్ష, కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేశ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజ్గోపాల్గౌడ్, ఏజీపీ షబానా, న్యాయవాదులు పాల్గొన్నారు.
పోస్టర్ల ఆవిష్కరణ
జిల్లాలోని ఏడు బెంచీలతో లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ జిల్లా చైర్మన్ వరప్రసాద్ తెలిపారు. గురువారం సాయంత్రం తన చాంబర్లో న్యాయమూర్తులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి, న్యాయమూర్తులు సుమలత, సుధాకర్, దీక్ష, సూపరింటెండెంట్ చంద్రసేన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.