బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి | - | Sakshi
Sakshi News home page

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

Jun 13 2025 7:07 AM | Updated on Jun 13 2025 7:07 AM

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

కామారెడ్డి క్రైం: బాల కార్మిక వ్యవస్ధ నిర్మూలనుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. ప్రపంచ బాల కార్మిక నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం తన చాంబర్‌లో వాల్‌ పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు చిన్నతనంలోనే తమ పిల్లలను పనికి పంపిస్తే వారి ఆరోగ్యం, భవిష్యత్‌ నాశనం అవుతాయని, బాలలు తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండాలన్నారు. బాల కార్మికులను గుర్తించే విషయంలో గ్రామ, వార్డు వలంటీర్లు, పంచాయతీ సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, సూపరింటెండెంట్‌ విజయభాస్కర్‌, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ కోటేశ్వర్లు, డీసీపీవో స్రవంతి, సాధన కో ఆర్డినేటర్‌ గిరిజ, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య..

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. మండలంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆయన గురువారం దుస్తులు పంపిణీ చేశారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖ సైంటిస్ట్‌ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో దుస్తులను అందజేశారు. డీఈవో రాజు, మండల ప్రత్యేకాధికారి సతీశ్‌యాదవ్‌, ఎంపీడీవో సంతోష్‌కుమార్‌, తహసీల్దార్‌ సత్యనారాయణ, ఎంఈవో యోసెఫ్‌, డీపీఎం రమేశ్‌బాబు, ఏపీఎం రాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పిల్లలతో పని చేయిస్తే వారి ఆరోగ్యం,

భవిష్యత్‌ నాశనం అవుతాయి

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement