
మొదటి రోజు హుషారుగా
కామారెడ్డి టౌన్: జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారు. హాజరైన విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు.
మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా సుమారు 50 శాతం విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 1040 పాఠశాలల్లో సుమారు 35వేలకు పైగా విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. బడిబాట కార్యక్రమం, అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందని డీఈవో ఎస్ రాజు తెలిపారు.
పున:ప్రారంభమైన పాఠశాలలు
జిల్లా వ్యాప్తంగా 50శాతం
విద్యార్థులే హాజరు