తగాదాలకు దూరంగా ఉండడం అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

తగాదాలకు దూరంగా ఉండడం అభినందనీయం

May 19 2025 2:13 AM | Updated on May 19 2025 2:13 AM

తగాదాలకు దూరంగా ఉండడం అభినందనీయం

తగాదాలకు దూరంగా ఉండడం అభినందనీయం

భిక్కనూరు : తగాదాలు, పోలీసు కేసులు లేకుండా జీవించడం అభినందనీయమని జిల్లా న్యాయసేవా ధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి టి.నాగరాణి పేర్కొన్నారు. శనివారం ఆమె ర్యాగట్లపల్లి గ్రామా న్ని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. 15 ఏ ళ్లుగా గ్రామంలో ఒక్క పోలీస్‌ కేసు లేకుండా ఉండడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రతిదానికి ఘర్షణలు పడుతూ పోలీస్‌ కేసులు పెట్టుకుంటున్న ఈ కాలంలో ఒక్క పోలీస్‌ కేసు లేకుండా ప్రజలు కలసిమెలసి ఉండడం అభినందనీయమన్నారు. మూడేళ్ల క్రితం ర్యాగట్లపల్లి గ్రామం ఒక్క కేసు లేని గ్రామంగా ఎంపికైందన్నారు. అలాగే ఈ గ్రామం ఇప్పటివరకు అ లానే ఉందన్నారు. ఒక్క కేసు నమోదు కాకుండా ఉ న్న విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టులకు నివేదించేందుకోసం గ్రామాన్ని సందర్శించడానికి వచ్చానన్నారు. యువత పాశ్చాత్య సంస్కృతి మోజులో ప డి వ్యసనాలకు బానిసగా మారుతోందని, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి తమ పిల్లలను వా టికి దూరంగా ఉంచాలని సూచించారు. గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలో ఏవైనా సమస్యలు ఎదురైతే ఎలా పరిష్కరించుకుంటారని ప్రశ్నించగా.. రాజీ మార్గాన్ని ఎంచుకుంటామని వారు స మాధానమిచ్చారు. తమ పెద్దలు చూపిన మార్గంలో పయనిస్తామని యువకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి చట్టాలపై ప్రజలకు అ వగాహన కల్పించారు. కార్యక్రమంలో నేతలు నరేందర్‌రెడ్డి, ప్రతాపరెడ్డి, సిద్దరామురెడ్డి, కోర్టు సూపరింటెండెంట్‌ చంద్రసేన్‌రెడ్డి పాల్గొన్నారు.

15 ఏళ్లుగా కేసుల్లేని గ్రామంగా

ర్యాగట్లపల్లి నిలిచింది

జిల్లా న్యాయసేవాధికార సంస్థ

కార్యదర్శి నాగరాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement