
భవన నిర్మాణాలకు భూమిపూజ
కామారెడ్డి అర్బన్: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవోస్) భవన నిర్మాణ పనులకు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. వేదపండితుడు జి ఆంజనేయశర్మ పూజలు నిర్వహించి ప్రతినిధులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భవన నిర్మాణానికి స్థలం కేటాయించిన కలెక్టర్ కు టీఎన్జీవోస్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముల్క రాజు, అసోసియేట్ అధ్యక్షుడు చక్రధర్, కోశాధికారి దేవరాజు, ప్రతినిధులు లక్ష్మణ్, రాజ్యలక్ష్మి, బి రాజేశ్వర్, పోచయ్య, రాజ్కుమార్, సంతోష్కుమార్, సాయినాథ్, పవన్, కిషన్, అనుదీప్, సురేఖ, శివకుమార్ ఆయా శాఖల నాయకులు పాల్గొన్నారు.
ఆర్ఎస్ఎస్ భవనానికి..
కామారెడ్డి అర్బన్: పట్టణంలోని ఎన్జీవోస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. కేశవ ట్రస్ట్ పేరిట ప్లాటు కొనుగోలు చేసి దాదాపు రూ.కోటి వ్యయంతో భవనాన్ని నిర్మిస్తున్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు బి.శంకర్, నగర అధ్యక్షుడు కే.స్వామి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రంజిత్మోహన్, ఎం.శ్రీకాంత్, నాయకులు ఆకుల భరత్కుమార్, నరేందర్, రాజు పాటిల్, కాసర్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

భవన నిర్మాణాలకు భూమిపూజ