రెండో విడతలో ఇళ్లు నిర్మించుకోవాలని మేమంతా అనుకుంటున్నాం. ఈలోగా హఠాత్తుగా మా స్థలాల నుంచి ఖాళీ చేయించారు. మా స్థలాల్లో వృద్ధాశ్రమం నిర్మించారు. మా స్థలాల కోసం అడిగితే పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పించుకున్నారు. చివరకు స్థలాలు చూపించారు కానీ, మా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించలేదు. గతంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా రిజిస్ట్రేషన్ కూడా చేయించింది. రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తేనే మాకు ఓ నమ్మకం ఉంటుంది. అలాగే, ఇళ్లు నిర్మించుకునేందుకు బ్యాంక్ రుణం కూడా వస్తుంది. – కోనాల ఆనంద్, జి.రాగంపేట, పెద్దాపురం


