సచివాలయాల వారీగా తల్లికి వందనానికి కరెంటు షాక్‌కు ఇవిగో ఉదాహరణలు | - | Sakshi
Sakshi News home page

సచివాలయాల వారీగా తల్లికి వందనానికి కరెంటు షాక్‌కు ఇవిగో ఉదాహరణలు

Jun 18 2025 3:45 AM | Updated on Jun 18 2025 3:45 AM

సచివా

సచివాలయాల వారీగా తల్లికి వందనానికి కరెంటు షాక్‌కు ఇవిగో

సచివాలయం అర్హులు అనర్హులు విద్యుత్‌

బిల్లులతో

అనర్హులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: తల్లికి వందనంలో తల్లులకు విద్యుత్‌ బిల్లులు షాక్‌ కొడుతున్నాయి. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ రూ.15 వేల చొప్పున తల్లికి వందనం ఇస్తామంటూ ఎన్నికల్లో గొప్పలు చెప్పిన కూటమి పెద్దల మాటలు నీటి మూటలే అయ్యాయి. పథకం అమలుకు వచ్చేసరికి సవాలక్ష కొర్రీలతో సగానికి సగం మందిపై అనర్హత వేటు వేశారు. గ్రామ సచివాలయాల్లో ప్రకటించిన తల్లికి వందనం జాబితాలు చూసి తల్లులు లబోదిబోమంటూ రోడ్డెక్కుతున్నారు. ప్రధానంగా ఎక్కువ మందికి విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు మించి ఉందనే కారణం చూపించి తల్లికి వందనం లేకుండా చేశారు.

విద్యుత్‌ కార్యాలయాల

వద్ద నిరసన

ఏడాది విద్యుత్‌ బిల్లులను నెలవారీగా లెక్క తీసినా 300 యూనిట్లలోపు వచ్చిన వారిని కూడా అనర్హుల జాబితాలో చేర్చడంపై తల్లులు మండిపడుతున్నారు. ఇదేం అన్యాయమంటూ కూటమి సర్కార్‌ తీరును నిరసిస్తూ విద్యుత్‌ కార్యాలయాలకు పోటెత్తారు. కాకినాడ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంతో పాటు పెద్దాపురం నియోజకవర్గంలో సైతం తల్లులు ఆగ్రహంతో విద్యుత్‌ కార్యాలయాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. భూమి ఎక్కువ ఉందని, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులని, కారు ఉందని, 300 యూనిట్లు మించి విద్యుత్‌ బిల్లు వచ్చిందనే కారణాలతో అనర్హులుగా తేల్చి, పలువురిని తల్లికి వందనానికి దూరం చేశారు.

కరెంటు మీటర్‌ లేకపోయినా..

కూటమి సర్కార్‌ అనర్హత వేటు వేసిన వారిలో కొందరి పేరున అసలు విద్యుత్‌ మీటర్లే లేవు. అయినప్పటికీ 300 యూనిట్లకు మించి విద్యుత్‌ వినియోగించారంటూ అనర్హుల జాబితాలో చేర్చారు. ఏడాది కాలంలో ఏ ఒక్క నెలలోనూ 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగం రాలేదని పలువురు తల్లులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ ఆ బెంచ్‌మార్క్‌ దాటిందనే కారణంతో తల్లికి వందనం లేకుండా చేశారని మండిపడుతున్నారు. కొందరి పేరున 4 నుంచి 10, 15 విద్యుత్‌ మీటర్లు ఉన్నట్లు రికార్డయ్యాయి. వాటిని చూసి తల్లికి వందనం లేకుండా చేశారని కొందరు తల్లులు విద్యుత్‌ అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఒకే మీటర్‌ ఉన్నప్పటికీ, తమ పేరిట ఇన్ని మీటర్లు ఉన్నట్టు ఎలా చూపుతున్నారని నిలదీశారు. తల్లికి వందనం లబ్ధిదారుల సంఖ్యను కుదించేందుకే ప్రభుత్వం ఇలా చేసి ఉంటుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతరుల మొబైల్‌ నంబర్లతో ఆధార్‌ లింక్‌ అయినందువల్లనే ఈ సమస్య వచ్చి ఉంటుందని ఏపీ ఈపీడీసీఎల్‌ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు పిఠాపురం, సామర్లకోట, తుని, కాకినాడ సహా అన్ని మండలాల్లోని సబ్‌ స్టేషన్ల వద్ద ఆరు నెలల స్టేట్‌మెంట్ల కోసం బారులు తీరి కనిపించారు. ఈపీడీసీఎల్‌ నుంచి ఈ స్టేట్‌మెంట్లు తెచ్చుకుని, అందజేస్తే తల్లికి వందనం దరఖాస్తులు పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ కొర్రీలతో అన్యాయమైపోయిన తల్లులు జిల్లాలో వేల సంఖ్యలోనే ఉన్నారని తెలుస్తోంది.

మీటరే లేదు.. 300 యూనిట్లు

ఎక్కడొచ్చాయి

నా భర్త చక్కపల్లి వీర వెంకట అప్పారావు వ్యవసాయమే ఆధారంగా కుటుంబాన్ని పోషిస్తున్నారు. మా కుమార్తె సాయి లక్ష్మి 2వ తరగతి, కుమారుడు ఒకటో తరగతి చదువుతున్నారు. నా పేరున కానీ, నా భర్త పేరున కానీ విద్యుత్‌ మీటరు లేదు. మాకు 300 యూనిట్ల కంటే ఎక్కువ బిల్లు వచ్చిందని తల్లికి వందనం పథకం లేకుండా చేశారు. విద్యుత్‌ మీటరు మా పేరున లేకపోయినా బిల్లు ఎలా చూపిస్తోందో అర్థం కావడం లేదు.

– చక్కపల్లి రమ్య, పోతులూరు, ప్రత్తిపాడు రూరల్‌

జగ్గంపేట మండలం

జగ్గంపేట–1 591 174 90

జగ్గంపేట–2 593 196 96

పెద్దాపురం మండలం

కట్టమూరు–1 443 64 39

కట్టమూరు–2 567 53 37

సామర్లకోట మండలం

సామర్లకోట–7 392 103 56

సామర్లకోట–11 277 83 34

కిర్లంపూడి మండలం

జగపతినగరం–1 440 66 32

జగపతినగరం–2 456 81 43

చిల్లంగి–3 456 81 43

తాళ్లరేవు మండలం

తాళ్లరేవు–1 428 187 90

తాళ్లరేవు–2 517 97 52

కరప మండలం

కరప–1 490 96 27

కరప–2 175 45 19

కోటనందూరు మండలం

కాకరాపల్లి 265 57 37

కోటనందూరు–2 379 91 46

కాకినాడ రూరల్‌ మండలం

వలసపాకల–1 351 168 100

వాకలపూడి–3 291 209 90

కాకినాడ అర్బన్‌ మండలం

41వ డివిజన్‌ సచివాలయం 523 232 120

ప్రత్తిపాడు మండలం

ఇ.గోకవరం 347 36 20

పిఠాపురం మండలం

పిఠాపురం–3 425 151 85

పిఠాపురం డ్రైవర్స్‌ కాలనీ 239 68 30

·˘ ™èlÍÏMìS Ð]l…§ýl¯é°MìS Mö{ÈÌS™ø Mø™èlË$

·˘ ÆøyðlzMìSP¯]l Ð]l$íßæâýæË$

·˘ 300 ĶæÊ°rÏ MýSsꋜOò³ Ð]l$…yìl´ër$

·˘ A¯]lÆý‡$áÌZÏ çÜVýS… Ð]l$…¨MìS C§ól çÜÐ]l$çÜÅ

·˘ ѧýl$Å™Œæ M>Æ>ÅÌSĶæ$… Ð]l§ýlª

మహిళల బారులు

˘ వేరే వాళ్ల కరెంట్‌ మీటర్లు కలిపేస్తే ఎలా?

అద్దె షాపులో సెలూన్‌ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. నాలుగు రోజులు పనుంటే రెండు రోజులు ఉండదు. దీంతో, చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. కరప నక్కా సూర్యనారాయణమూర్తి జెడ్పీ హైస్కూలులో పెద్ద కుమార్తె హర్షిత 10, కుష్మిత 7వ తరగతి చదువుతున్నారు. తల్లికి వందనం పథకంలో ఇద్దరు పిల్లలకూ డబ్బులొస్తాయని ఎదురు చూస్తూంటే కరెంట్‌ బిల్లు ఎక్కువని ఆపేశారు. మాకు కరెంట్‌ బిల్లు ఎప్పుడూ 180 యూనిట్లకు మించి రాలేదు. కరెంట్‌ ఆఫీసుకు వెళితే ఆరు నెలల బిల్లులు చూసి, నెలకు సరాసరిన 194 యూనిట్ల వంతున కరెంట్‌ వాడుకున్నట్టు సర్టిఫికెట్‌ ఇచ్చారు. కరెంట్‌ ఎక్కువ వాడకుండానే వాడినట్లు ఇవ్వడమేమిటో అయోమయంగా ఉంది.

– మల్లువలస నాగమణి, పాపారావు దంపతులు, రామకంచిరాజు నగర్‌ కాలనీ, కరప

కరెంట్‌ బిల్లు సాకుతో

కోత పెట్టారు

మా కుమార్తె గీతిక 7వ తరగతి చదువుతోంది. కరెంట్‌ బిల్లు అధికంగా వచ్చిందనే కారణం చూపించి తల్లికి వందనం డబ్బు ఇవ్వలేదు. చదువుకునే పిల్లలకు వచ్చే డబ్బులకు, కరెంట్‌ బిల్లులకు ముడిపెట్టడం సరికాదు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఎటువంటి అడ్డంకులూ లేకుండానే మాకు అమ్మ ఒడి డబ్బు వచ్చింది. ఈ ప్రభుత్వంలో అధిక విద్యుత్‌ బిల్లు వచ్చిందంటూ అనర్హుల జాబితాలో చేర్చారు.

– పెంటకోట సుధావాణి, కిర్లంపూడి

ఫ తల్లికి వందనానికి కొర్రీలతో కోతలు

ఫ రోడ్డెక్కిన మహిళలు

ఫ 300 యూనిట్ల కటాఫ్‌పై మండిపాటు

ఫ అనర్హుల్లో సగం మందికి ఇదే సమస్య

ఫ విద్యుత్‌ కార్యాలయం వద్ద

మహిళల బారులు

సచివాలయాల వారీగా తల్లికి వందనానికి కరెంటు షాక్‌కు ఇవిగో1
1/3

సచివాలయాల వారీగా తల్లికి వందనానికి కరెంటు షాక్‌కు ఇవిగో

సచివాలయాల వారీగా తల్లికి వందనానికి కరెంటు షాక్‌కు ఇవిగో2
2/3

సచివాలయాల వారీగా తల్లికి వందనానికి కరెంటు షాక్‌కు ఇవిగో

సచివాలయాల వారీగా తల్లికి వందనానికి కరెంటు షాక్‌కు ఇవిగో3
3/3

సచివాలయాల వారీగా తల్లికి వందనానికి కరెంటు షాక్‌కు ఇవిగో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement