వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పలువురికి స్థానం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పలువురికి స్థానం

Jun 18 2025 3:45 AM | Updated on Jun 18 2025 3:45 AM

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర  అనుబంధ  విభాగాల్లో పలువురికి స

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పలువురికి స

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): వైఎస్సార్‌ సీపీ బలోపేతంలో భాగంగా కాకినాడ జిల్లాకు చెందిన పలువురికి రాష్ట అనుబంధ విభాగాల్లో చోటు కల్పించారు. రాష్ట్ర మైనార్టీ సెల్‌ జోనల్‌ అధ్యక్షుడిగా కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన అబ్ధుల్‌ బషీరుద్దీన్‌, రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యదర్శిగా కాకినాడ సిటీ నియోజవర్గానికి చెందిన హసన్‌ షరీఫ్‌, రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కాకి లక్ష్మణరావు (నాని), రాష్ట్ర ఎస్సీసెల్‌ సెక్రటరీగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన చిన్నాడ భీమరాజు, రాష్ట్ర ఎస్టీ సెల్‌ జాయింట్‌ సెక్రటరీగా తుని నియోజకవర్గానికి చెందిన పి.బాబూరావు, రాష్ట్ర అంగన్‌వాడీ విభాగం జనరల్‌ సెక్రటరీగా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన అంబటి బొజ్జనమ్మ, రాష్ట్ర కల్చరల్‌ విభాగం అధికార ప్రతినిధిగా ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన దొడ్డిపట్ల సోమన్నదొర, రాష్ట్ర గ్రీవెన్స్‌ సెల్‌ జాయింట్‌ సెక్రటరీగా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన ఒబ్బిని వీరబాబు ఎంపికయ్యారు.

ఐఎఫ్‌టీ నిర్మాణానికి

రూ.25 కోట్లు విడుదల

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఐఐఎఫ్‌టీ (ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫారిన్‌ ట్రేడ్‌) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేసిందని ఎంపీ తంగేళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తపల్లి మండలం పొన్నాడ వద్ద 229.81 కోట్ల వ్యయంతో నిర్మించే క్యాంపస్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం నిధులను గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మంజూరు చేశాయి.

కొన్ని పాఠశాలలకు

మూడురోజుల సెలవు

కాకినాడ సిటీ: ఈ నెల 21న విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమానికి ప్రజల సమీకరణ, బస్సుల సేకరణకు జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మూడు రోజులు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్‌ షణ్మోహన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విశాఖపట్నంలో ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారన్నారు. రవాణా సౌకర్యాల ఏర్పాటు కోసం జిల్లాలోని విద్యా సంస్థలకు 19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజులు సెలవులు ఇచ్చామని కలెక్టర్‌ తెలిపారు. సెలవులు ప్రకటించిన పాఠశాలల జాబితాలను ఆయన ప్రకటించారు.

రక్త సేకరణలో

జేఎన్‌టీయూకేకు అవార్డు

బాలాజీచెరువు: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన రక్త సేకరణలో జేఎన్‌టీయూకే రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి అవార్డును సాధించింది. గుంటూరులో వైద్యశాఖమంత్రి సత్యకుమార్‌యాదవ్‌ ఈ అవార్డును అందజేశారు. మంగళవారం జేఎన్‌టీయూకే వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ తన చాంబర్‌లో అవార్డు అందుకున్న ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ శ్యామ్‌కుమార్‌ను అభినందించారు. 2023–24 ఏడాదికి వర్సిటీ అనుబంధ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్ల సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహించి అధిక యూనిట్లు సేకరించడం సంతోషమని, ఈ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. శ్యామ్‌కుమార్‌ను రెక్టార్‌ కేవీ రమణ, రిజిస్ట్రార్‌ రవీంద్ర, ప్రిన్సిపాల్‌ మోహనరావు అభినందించారు.

మళ్లీ రండి...

కాకినాడ క్రైం: సచివాలయ ఏఎన్‌ఎంల నుంచి ఎంపీహెచ్‌ఏ–ఎఫ్‌(మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ ఫిమేల్‌)గా పదోన్నతి పొందిన అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆదివారం కాకినాడ డీఎంహెచ్‌వో కార్యాలయంలో ప్రమోషన్‌ కం ట్రాన్స్‌ఫర్‌ కోసం 390 మంది అభ్యర్థులకు కౌన్సిలింగ్‌ ప్రక్రియ జరగగా వారందరినీ రీ వెరిఫికేషన్‌ కోసం మళ్లీ పిలిచారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం వీరంతా కాకినాడ డీఎంహెచ్‌వో కార్యాలయానికి హాజరుకానున్నారు. కౌన్సిలింగ్‌ ప్రక్రియ ర్యాంకులను అనుసరించి జరగలేదనీ, కొన్ని సబ్‌ సెంటర్లకు చెందిన ఏఎన్‌ఎంలను కౌన్సెలింగ్‌కు పిలవకపోవడంతోపాటు వారికి పదోన్నతులు వర్తించలేదన్న అసంతృప్తి ఫిర్యాదుల రూపంలో కలెక్టర్‌కి చేరింది. దీంతో కలెక్టర్‌ షణ్మోహన్‌ కౌన్సిలింగ్‌ను పునః పరిశీలించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ నరసింహ నాయక్‌ ఆధ్వర్యంలో అధికారుల బృందం మంగళవారం కౌన్సెలింగ్‌ ప్రక్రియపై రీ వెరిఫికేషన్‌ నిర్వహించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement