
అధినేతతో భేటీ
తొండంగి: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులైన తొండంగి మండలం దానవాయిపేటకు చెందిన మడదా హేమంత్ తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం కలిశారు. రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా మడదా హేమంత్ను ఇటీవల నియమించారు. ఈ నేపథ్యంలో మర్యాద పూర్వకంగా వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో కలిసి జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.