
నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉండాలి
కాకినాడ సిటీ: బియ్యం, కందిపప్పు, ఇతర పప్పు ధాన్యాలు, కూరగాయలు అందుబాటు ధరల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, వ్యాపారులను జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశించారు. తన చాంబర్లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి ధరల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల రోజుల ముందు, ప్రస్తుతానికి కూరగాయల ధరల్లో ఉన్న వ్యతాసాలను పరిశీలించారు. కందిపప్పు, ఇతర పప్పు ధాన్యాల ధరలు అందుబాటులో ఉన్నాయో లేవో సంబంధిత హోల్సేలర్లు, రిటైలర్లను అడిగి తెలుసుకున్నారు. వినియోదారుల సంఘం సభ్యులు మాట్లాడుతూ, కాకినాడ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరికొన్ని రైతుబజార్లు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. దీనిపై తగు నివేదిక ఇవ్వాలని మార్కెటింగ్ శాఖను జేసీ ఆదేశించారు. పాలు, బ్రెడ్ ప్యాకెట్లు, ఇతర ఆహార పదార్థాల ప్యాకింగ్పై తప్పనిసరిగా తయారీ తేదీ, వినియోగ తేదీ ముద్రించాలని స్పష్టం చేశారు. అలా లేకుంటే తన దృష్టికి తీసుకురావాలని వినియోగదారుల సంఘ సభ్యులకు జేసీ సూచించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణరాజు, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ఎం.దేవుల నాయక్, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ ఎస్.సలీం, మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి.రాఘవేంద్ర కుమార్, వాణిజ్య పన్నుల శాఖ నుంచి జి.పద్మావతి తదితరులు పాల్గొన్నారు.