ఎంజీకేఎల్ఐ ద్వారా 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు 25 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మొదట డిజైన్లు రూపొందించారు. 2005లో ఆయకట్టు విస్తీర్ణాన్ని 3.40 లక్షలకు పెంచారు. 2011లో నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఎల్లూరు పంప్హౌజ్లోని 5 మోటార్ల ద్వారా రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లకు నీటిని తరలించేలా డిజైన్లు చేశారు. 2016లో ప్రాజెక్టుకు 40 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి. దీంతో ఆయకట్టు విస్తీర్ణాన్ని 4.24 లక్షల ఎకరాలకు పెంచారు.


