రైతుకు భరోసా | - | Sakshi
Sakshi News home page

రైతుకు భరోసా

Jun 17 2025 5:20 AM | Updated on Jun 17 2025 5:20 AM

రైతుక

రైతుకు భరోసా

తొలిరోజు 87,496 మంది ఖాతాల్లో రూ.58.18కోట్లు జమ

డబ్బులు జమయ్యాయి..

నాకు కొండేరు శివారు లో ఎకరన్నర వ్యవసా య భూమి ఉంది. క్ర మం తప్పకుండా వరిపంట సాగుచేస్తాను. ప్ర భుత్వం రైతుభరోసా ప థకం కింద నాకు ఎకరన్నర భూమికి సంబంధించి రూ. 9వేలను ప్రభుత్వ జమ చేసింది.

– కృష్ణయ్య, రైతు,

కొండేరు, ఎర్రవల్లి మండలం

అర్హత ఉన్న ప్రతి రైతుకు..

జిల్లాలో 2024 యాసంగి సీజన్‌ నాటికి మొత్తం 1,65,763 మంది రైతులు రైతుభరోసాకు దరఖాస్తు చేసుకున్నారు. అదే విధంగా కొత్తగా మరో 4వేల మందికి పైగా రైతులకు భూభారతి పట్టాదారు పాస్‌పుస్తకాలు వచ్చాయి. రైతుభరోసాకు దరఖాస్తు చేసుకొని అర్హత గల రైతులందరికీ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించనుంది.

– సక్రియా నాయక్‌, డీఏఓ

గద్వాల: వానాకాలం పంటల సాగుకు సిద్ధమైన అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. సాగు పెట్టుబడుల కోసం సోమవారం నుంచి రైతుభరోసా పథకం నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. సకాలంలో పెట్టుబడి సాయం అందిస్తుండటంతో రైతులు సంబురపడుతున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2018 నుంచి 2023 రైతుబంధు పేరుతో ఎకరాకు రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయం అందించగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రైతుభరోసా పథకానికి శ్రీకారం చుట్టి.. రూ. 12వేలకు పెట్టుబడి సాయాన్ని పెంచింది. వానాకాలం రూ. 6వేలు, యాసంగి సీజన్‌లో రూ. 6వేల చొప్పున రైతులకు అందిస్తోంది. గతేడాది 1,65,763 మంది రైతులకు రైతుభరోసా అందించింది. ప్రస్తుత వానాకాలం సాగు పెట్టుబడుల నిమిత్తం రైతుభరోసా సాయాన్ని అందించాలని సోమ వారం రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించడం.. సాయంత్రం నుంచే రెండెకరాల లోపు ఉన్న రైతులకు రైతుభరోసా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కావడం ప్రారంభమైంది.

మొదటి రోజు 87వేల మంది రైతులకు..

జిల్లాలో రెండెకరాల లోపు భూమి ఉన్న 87,496 మంది రైతులకు ఎకరా రూ.6వేల చొప్పున రూ.58,18,86,282 నిధులను బ్యాంకు ఖాతాలో జమచేశారు. ఈ నెల 25వ తేదీ వరకు దశల వారీగా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా, కొత్తగా అర్హత పొందిన రైతుల పేర్లను ’రైతుభరోసా’ జాబితాలో చేర్చే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. వీరికి ఈ నెలాఖరులోగా నిధులు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

2018 నుంచి పెట్టుబడి సాయం ఇలా..

జిల్లాలో 165763 మందిరైతులకు లబ్ధి

గతేడాది రూ. 234.83 కోట్లు విడుదల

కొత్తగా మరో 4వేల మంది అర్హులు

రైతుకు భరోసా 1
1/4

రైతుకు భరోసా

రైతుకు భరోసా 2
2/4

రైతుకు భరోసా

రైతుకు భరోసా 3
3/4

రైతుకు భరోసా

రైతుకు భరోసా 4
4/4

రైతుకు భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement