
భట్టికి కేటీపీపీ ఇంజనీర్ల వినతి
గణపురం: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఇంజనీర్ల సమస్యలను పరిష్కరించాలని ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందించారు. మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మధ్యాహ్నం గణపురం మండలం చెల్పూరు కేటీపీపీలోని గోదావరి అతిథిగృహానికి లంచ్కు వచ్చారు. ఆయనకు అసోసియేట్ జనరల్ సెక్రటరీ భాస్కర్ ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియమావళి ప్రకారం 1999 నుంచి 2004 మధ్య నియామకం పొందిన ఇంజనీర్లకు జీపీఎఫ్ విధానం అమలు చేయాలన్నారు. తెలంగాణ జెన్కోలో పనిచేస్తున్న ఇంజనీర్లకు బదిలీ మార్గదర్శకాలు జారీచేయాలని చెప్పారు. జెన్కో డిస్కౌంట్ ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టులను భర్తీచేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు.
పోల్టాక్స్
రద్దుచేయాలని వినతి
భూపాలపల్లి అర్బన్: కేబుల్ ఆపరేటర్లపై ప్రభుత్వం విధిస్తున్న పోల్ టాక్స్ను రద్దుచేయాలని కోరుతూ కేబుల్ ఆపరేటర్ల సంఘం నాయకులు మంగళవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వేశాల రమేష్బాబు మాట్లాడుతూ.. కేబుల్ ఆపరేటర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ పనిచేస్తున్నారని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించి టాక్స్ రద్దుచేయాలని కోరారు.
జాబ్మేళాను
సద్వినియోగం చేసుకోవాలి
ములుగు రూరల్: నిరుద్యోగ యువత రేపు(19న) జిల్లాకేంద్రంలోని టాస్క్ రీజినల్ సెంటర్లో నిర్వహిస్తున్న జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. టాస్క్ రీజినల్ సెంటర్లో నైపుణ్య శిక్షణ పొందిన టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ పొందిన టెన్త్, ఇంటర్, డిప్లమా, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ విద్యార్థులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. శిక్షణ పొందిన నిరుద్యోగ యువత ములుగు, వరంగల్, హైదరాబాద్లోని సాబిక్ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్, టాటా స్ట్రీవ్, జస్ట్డియల్, జహ్నావి కమ్యూనికేషన్, హెచ్బీడీ ఫైనాన్స్, షణ్ముక బయో ఆర్గానిక్స్, ముథూట్ మైక్రోఫిన్ లిమిటెడ్, శ్రీరాం ఫైనాన్స్తో పాటు ఇతర కంపెనీలలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని టాస్క్ రీజినల్ సెంటర్లో హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు టాస్క్ రీజినల్ కో ఆర్డీనేటర్ సెల్ నంబర్ 9618449360లో సంప్రదించాలని తెలిపారు.
పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకం
ఏటూరునాగారం: బాల్య వివాహాల నిర్మూలనలో పంచాయతీ కార్యదర్శులు ప్రధాన పాత్ర పోషించాలని బాల్య వివాహ నిరోధక అధికారిణి, సీడీపీఓ ప్రేమలత అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగము ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు బాల్యవివాహాల నిషేధ చట్టం – 2006 పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగము అధికారి హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆధునిక సమాజంలో ఇప్పటికీ బాల్య వివాహాలు సవాల్గా మారాయన్నారు. మారుమూల ప్రాంతాల్లో వివిధ కారణాలతో బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ స్థాయిలో బాల్యవివాహ నిరోధక అధికారులుగా పంచాయతీ కార్యదర్శులు వ్యవహరించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో బాల్య వివాహాల నిర్మూలనలో పంచాయతీ కార్యదర్శులు ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. బాల్య వివాహ రహిత జిల్లాగా ములుగును మార్చడమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీఓ కుమార్ మాట్లాడారు.

భట్టికి కేటీపీపీ ఇంజనీర్ల వినతి