
నిబంధనలు పాటించకుంటే గుర్తింపు రద్దు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల గుర్తింపును రద్దుచేయాలని ప్రోగ్రెస్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (పీఎస్ఎఫ్ఐ) జిల్లా అధ్యక్షుడు పసుల వినయ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ధనార్జనే ధ్యేయంగా భావిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బు దోచుకుంటున్నారని ఆరోపించారు. పాఠశాలలోనే పుస్తకాలు, బట్టలు అమ్ముతూ విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కి తమకు ఇష్టం వచ్చిన ఫీజులు పెట్టుకొని వసూలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు.
ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా సమ్మయ్య
మల్హర్: లంబాడీ హక్కుల పోరాట సమితి (ఎల్హెచ్పీఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పెద్దతూండ్ల గ్రామానికి చెందిన అజ్మీర సమ్మయ్య నాయక్ నియమితులయ్యారు. సోమవారం సంఘం జాతీయ అధ్యక్షుడు దస్రం నాయక్ చేతుల మీదుగా సమ్మయ్య నాయక్ నియామక పత్రం అందుకున్నారు.
జిల్లా కమిటీ ఎన్నిక
భూపాలపల్లి అర్బన్: వ్యాయామ విద్య ఉపాధ్యాయుల సంఘం జిల్లా కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సిరంగి రమేష్, ప్రధాన కార్యదర్శిగా గట్టికొప్పుల సురేష్లను జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ అధ్యక్ష పదవి తనలో మరింత బాధ్యత పెంచిందని రమేష్ తెలిపారు.
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: బీసీ బాలుర, బాలికల వసతి గృహాల్లో ప్రవేశాల కోసం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3వతరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి క్రాంతి కిరణ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ బీసీ బాలికల వసతిగృహం గణపురం (81) సీట్లు, ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహం చిట్యాల (64), మొగుళ్లపల్లి (27), మహదేవపూర్ (72), మహాముత్తారం బాలుర వసతిగృహం (69) సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. జిల్లాలోని విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో చేసిన దరఖాస్తుతో పాటు సంబంధిత పత్రాలు జతచేసి వసతి గృహ సంక్షేమ అధికారికి 30వ తేదీ సాయంత్రంలోగా అందించాలన్నారు. వివరాలకు వసతి గృహాల్లో సంప్రదించాలని సూచించారు.
18,19 తేదీల్లో
ఎంపిక పోటీలు
భూపాలపల్లి అర్బన్: స్పోర్ట్స్ పాఠశాలల ఎంపికకు ఈ నెల 18, 19వ తేదీల్లో మండల స్థాయి ఎంపిక క్రీడాపోటీలను నిర్వహించనున్నట్లు మండల ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి దేవానాయక్ తెలిపారు. సోమవారం మండలంలో పీఈటీలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ పాఠశాలలకు మండలస్థాయిలో ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 4వ తరగతి కోసం 8నుంచి 9సంవత్సరాలలోపు బాలబాలికలు హాజరుకావాలని సూచించారు. పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పీఈటీలు రాజయ్య, శ్రీకోటి, రియాజ్, నవీన్ పాల్గొన్నారు.
నియామకం
చిట్యాల: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యునైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీగా మండలకేంద్రానికి చెందిన కారోబార్ అంకం సదానందంను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాధ్యతలు అప్పగించిన ప్రతీ ఒక్కరికి సదానందం కృతజ్ఞతలు తెలిపారు.

నిబంధనలు పాటించకుంటే గుర్తింపు రద్దు

నిబంధనలు పాటించకుంటే గుర్తింపు రద్దు

నిబంధనలు పాటించకుంటే గుర్తింపు రద్దు

నిబంధనలు పాటించకుంటే గుర్తింపు రద్దు