
నేరుగా ఇసుక వ్యాపారం చేసుకోవాలి
ఏటూరునాగారం: జిల్లాలోని ఇసుక రీచ్లకు గిరిజన సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తూ 30 మంది సభ్యుల భాగస్వామ్యంతో గిరిజన సంఘాలు నేరుగా ఇసుక వ్యాపారం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ, టీజీఎండీసీ సంయుక్తంగా గిరిజన మహిళా సంఘాల సభ్యులకు ఇసుక రీచ్లపై సోమవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ఇసుక వ్యాపారంలో థర్డ్పార్టీ ప్రమేయం లేకుండా స్వతంత్రంగా ఇసుక కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు సంఘాల సభ్యులు సిద్ధంగా ఉండాలన్నారు. ఎనిమిది సంఘాలకు వ్యాపారాన్ని ఎలా నిర్వహించుకోవాలో వివరించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గిరిజన సంఘాలకు ఇసుక వ్యాపారం ఎలా చేయాలని టీజీఎండీసీ సిబ్బందితో శిక్షణ, అవగాహన పూర్తిగా ఇప్పించినట్లు వెల్లడించారు. ఇసుక రీచ్లను స్వతంత్రంగా స్థిరంగా నిర్వహించడానికి గిరిజన సంఘాలకు అధికారం ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఇందుకోసం కావాల్సిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, డిప్యూటీ తహసీల్దార్లు అనిల్, కిశోర్ కుమార్, టీజీఎండీసీ సిబ్బంది, ఇసుక సొసైటీల సభ్యులు పాల్గొన్నారు.
అటవీ భూములపై గిరిజనులతో పీఓ చర్చ
మండలంలోని రొయ్యూర్ అటవీశాఖ పరిధిలో ఉన్న భూముల్లో గిరిజనులు గుడిసెలు వేయడంతో గొడవకు దారి తీసిన విషయంపై సోమవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ ఆర్ఓఎఫ్ఆర్ విభాగం డిప్యూటీ తహసీల్దార్లు గిరిజనులతో చర్చించారు. రెవెన్యూ భూములు, అటవీశాఖ భూములు పరిస్థితి, హక్కుల విధానాన్ని డీటీలు అనిల్, కిశోర్కుమార్ గిరిజనులు వివరించారు. అనంతరం ఐటీడీఏ పీఓ సమావేశానికి హాజరై అటవీభూముల్లో ఇళ్ల సమస్య, అందుబాటులో ఉన్న పట్టా భూముల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలను మంత్రి సీతక్క, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, ఐటీడీఏ డీడీ పోచం, గిరిజన నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా