నేడు డిప్యూటీ సీఎం రాక | - | Sakshi
Sakshi News home page

నేడు డిప్యూటీ సీఎం రాక

Jun 17 2025 5:20 AM | Updated on Jun 17 2025 5:20 AM

నేడు డిప్యూటీ సీఎం రాక

నేడు డిప్యూటీ సీఎం రాక

భూపాలపల్లి: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నేడు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా మంగళవారం ఉదయం 11 గంటలకు రేగొండ మండలం చెన్నాపూర్‌కు చేరుకొని 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి భూపాలపల్లికి చేరుకొని మంజూర్‌నగర్‌, చిట్యాల మండలం నవాబుపేట, గణపురం మండలంలోని ధర్మారావుపేటలో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12.45 గంటలకు మంజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాసభలో డిప్యుటీ సీఎం ప్రసంగిస్తారు. కేటీపీపీ అతిథి గృహంలో మధ్యాహ్న భోజనం చేశాక, 2.30 గంటలకు అతిథి గృహంలోని మీటింగ్‌ హాల్‌లో సింగరేణి అధికారులతో సమావేశమై సంస్థ ప్రాజెక్టు విషయాలపై చర్చించనున్నారు. సమావేశం అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం వెళ్తారు.

ఏర్పాట్ల పరిశీలన..

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు జిల్లాలో పర్యటించనున్న నేపధ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్‌ రాహుల్‌ శర్మ పరిశీలించారు. ప్రజా సభాస్థలితో పాటు ప్రారంభోత్సవ స్థలాలను పరిశీలించి ఆయా శాఖల అధికారులకు సూచనలు చేశారు.

పలు అభివృద్ధి పనుల ప్రారంభం,

శంకుస్థాపన

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎమ్మెల్యే గండ్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement