ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి

Jun 17 2025 5:20 AM | Updated on Jun 17 2025 5:20 AM

ప్రజా

ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి

భూపాలపల్లి: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ సూచించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి 53 మంది ఫిర్యాదులు సమర్పించగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్‌కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్ర ప్రభుత్వం, క్రీడాశాఖ ఆధ్వర్యంలో నడిచే క్రీడా పాఠశాలల ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రవేశాల వాల్‌పోస్టర్‌ను సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, వీవైఎస్‌ఓ రఘు, ఆర్డీఓ రవి పాల్గొన్నారు.

ఐటీఐ, ఏటీసీలో అడ్మిషన్లు ప్రారంభం..

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ) ఆధ్వర్యంలో 2025–26/27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ నూతన కోర్సులను ప్రారంభించినట్లు అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో వివిధ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ల వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ... పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐటీఐలో ప్రవేశం కోసం జూన్‌ 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌ నంబర్‌ 89851 00563లో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, ఐటీఐ ప్రిన్సిపల్‌ జమ్లనాయక్‌, ఆర్డీఓ రవి పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌

ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి1
1/1

ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement