
పంట నష్ట పరిహారం చెల్లించాలి
గోవిందరావుపేట: వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం తెలంగాణ రైతుసంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ఏప్రిల్, మే నెలలో కురిసిన భారీ వడగండ్ల వర్షాలకు మండల పరిధిలోని పంటపొలాలు 60శాతం వరకు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. రైతుల అకౌంట్లలో వెంటనే మంజూరైన డబ్బులను జమ చేయాలన్నారు. యాసంగిలో పండించిన ధాన్యానికి బోనస్ డబ్బులు పడలేదని వివరించారు.