పాండవుల గుట్టలు అద్భుతం | - | Sakshi
Sakshi News home page

పాండవుల గుట్టలు అద్భుతం

Jun 12 2025 3:47 AM | Updated on Jun 12 2025 3:47 AM

పాండవుల గుట్టలు అద్భుతం

పాండవుల గుట్టలు అద్భుతం

రేగొండ: పాండవుల గుట్టలు అద్భుతంగా ఉన్నాయని ట్రెయినీ కలెక్టర్లు అన్నారు. బుధవారం మండలంలోని రావులపల్లి శివారులోని పాండవుల గుట్టలను 2024 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ల బృందం సౌరభ్‌శర్మ, సలోని చబ్ర, హర్ష చౌదరి, ప్రణయ్‌ కుమార్‌, కరోలిన్‌ చింగ్తాయిన్మావిలు సందర్శించి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా వారు గుట్టలోని కుంతీదేవి, కొలనుకుంటా, పాండవుల కాలం నాటి రాతి చిత్రాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాండవుల గుట్టలు అతి సుందరమైనవని, మహాభారత కాలం నాటి చారిత్రాక ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయన్నారు. వారి వెంట తహసీల్దార్‌ శ్వేత, జిల్లా యువజన, క్రీడాల శాఖ అధికారి రఘు, కోర్సు డైరెక్టర్‌ కందుకూరి ఉషారాణి, నోడల్‌ అధికారి శ్రీనివాస్‌, ఎఫ్‌ఎస్‌ఓ గౌతమి, ట్రెయినీ ఎస్సై దివ్య, ఆర్‌ఐ భరత్‌రెడ్డి, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement