
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
మంగపేట: రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 సంవత్సర డైరీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాలని ఆలయాలు పచ్చదనం పరిశుభ్రతతో ఉండాలనే ఆకాంక్షతో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీకత్క పనిచేస్తున్నారన్నారు. దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చక ఉద్యోగుల సమస్యలపై త్వరలో సదస్సు నిర్వహించేందుకు సీఎం రేవంత్రెడ్డి అంగీకరించారని, ఆ సదస్సులో అర్చక ఉద్యోగుల దూపదీప నైవేద్యం, అర్చకుల సమస్యలు పరిష్కారం కాబోతున్నాయన్నారు. ముక్తేశ్వర స్వామి సన్నిధిలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే త్రివేణి సంగమంలోని అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలను ప్రయాగ్రాజ్లో నిర్వహించిన తరహాలో వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్ ప్రత్యేక చొరవతో కోట్లాది మంది హిందువులు పుణ్య స్నానాలు చేయాలనే సంకల్పంతో ఏర్పా ట్లు చేస్తున్నారన్నారు. భక్తులు తరలివచ్చి పవిత్రమైన పుణ్య స్నానాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అర్చక జేఏసీ గౌరవ అధ్యక్షుడు ముక్కామల రాజశేఖర్ శర్మ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్
గంగు ఉపేంద్రశర్మ