24గంటల్లో కోర్టులో హాజరుపర్చాలి | - | Sakshi
Sakshi News home page

24గంటల్లో కోర్టులో హాజరుపర్చాలి

Jun 14 2024 2:12 AM | Updated on Jun 14 2024 2:12 AM

24గంటల్లో  కోర్టులో హాజరుపర్చాలి

24గంటల్లో కోర్టులో హాజరుపర్చాలి

వెంకటాపురం(కె): తడపల అటవీ ప్రాంతంలో ఈ నెల 12వ తేదీన గ్రేహౌండ్స్‌ పోలీసులు పట్టుకున్న ముగ్గురు మావోయిస్టు సభ్యులు రీతా, మోతీ, ఇడ్మాలతో పాటు పనుల రీత్యా అటవికి వెళ్లిన మరో ముగ్గురిని 24గంటల్లో కోర్టులో హాజరుపర్చాలని వెంకటాపురం, వాజేడు మావోయిస్టు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరున సోషల్‌ మీడియాలో గురువారం నుంచి లేఖ వైరల్‌ అవుతోంది. పట్టుకున్న వారిని ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఎలాంటి సంబంధం లేని మరో ముగ్గురు అమాయకులను బాంబుల గురించి చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేయడం సరికాదన్నారు. దీన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను ఖండించాలని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement