
ఇంటి నంబర్లు కేటాయించాలి
జనగామ రూరల్: పట్టణంలో మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లకు అధికారులు ఇంటి నంబర్లు వేసి కనీస సౌకర్యాలు కల్పించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ అన్నారు. మంగళవారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ..గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణంలోని నిరుపేదలకు 114 ఇంటి స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చారన్నారు. అందులో అనేక ఇబ్బందులు పడి ఇంటి నిర్మాణం చేసుకున్నారని, కానీ ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భూక్య చందు నాయక్ ముసుపట్ల జయ, తేరాల అండాలు, ఏనుగుల కమల, గంగా కౌర్, గంగాధరి సురేష్, సిలివేరి ఉపేందర్, బాలస్వామి, మంద అ మల, రాములు, నీల సమ్మక్క, స్వరూప, దానమ్మ, సుజాత, సిద్ధమ్మ తదితరులు పాల్గొన్నారు.