
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని సాధించాలి
జనగామ రూరల్: ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇళ్లు లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను కోరారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నియోజకవర్గ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేశ్కుమార్లతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. రెండవ విడతగా ఐదు మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు పత్రాలు అందజేయగా మార్కింగ్ పనులు వేగవంతంగా జరిగిందన్నారు. ఇళ్ల ప్రగతిలో స్టేషన్ఘనపూర్ నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ ఆర్డీఓ డీఎస్. వెంకన్న, డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమంత నాయక్, హౌసింగ్ పీడీ మాతృనాయక్, డీఈ చంద్రశేఖర్, ఏఈలు, అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి