
సోమేశ్వరాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పూజలు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి, ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ జడ్జి సందీప, ఆలయ ఈఓ సల్వాది మోహన్ బాబు, ఎస్సై దూలం పవన్కుమార్, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్శర్మ, అనిల్కుమార్, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యం
జనగామ రూరల్: దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే మోదీ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మనోహర్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి అన్నారు. శనివారం జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ సుపరిపాలన 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రొఫెషనల్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి పేదల అభ్యన్నతికి తోడ్పాటునందిస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు అత్యధిక స్థానాలు గెలవాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు దశమంత రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగా రామ్మోహన్ రెడ్డి, కేవీఎల్ఎన్ రెడ్డి, ఉడుగుల రమేష్, నందా రెడ్డి, తోకల ఉమారాణి, శివరాజ్ యాదవ్, శశిధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్య మహాసభ జోన్ చైర్మన్గా వేదకుమార్
జనగామ/రఘునాథపల్లి: జిల్లా ఆర్యవైశ్య మహాసభ జోన్ చైర్మన్గా రఘునాథపల్లికి చెందిన కూరెళ్ల వేదకుమార్ నియామకమయ్యా రు. ఈ మేరకు శనివారం ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్య క్షుడు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్కుమార్ వెల్లడించారు. అనంతరం వేదకుమార్కు నియామకపత్రం అందించి శాలువాతో సత్కరించారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తానని, ఈ నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గన్ను నరసింహులు, కోశాధికారి బెజుగం భిక్షపతి, రీజన్ చైర్మన్ పడకంటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలి
జనగామ రూరల్: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు అధ్యక్షత జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం అవుతున్నప్పటికీ విద్యా రంగంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించి ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కల్పించాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీనివాస్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్, కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్, కన్వీనర్ గూడెల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సోమేశ్వరాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పూజలు

సోమేశ్వరాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పూజలు