ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన బోధన | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన బోధన

Jun 14 2025 7:43 AM | Updated on Jun 14 2025 7:43 AM

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన బోధన

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన బోధన

పాలకుర్తి టౌన్‌: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధన అందుతుందని డీఈఓ డి.భోజన్న అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, టెంపుల్‌ కాలనీ పాఠశాలల్లో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలతో ఈ విద్యాసంత్సరం ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌) తరగతులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, మైనర్‌ రిపేర్‌ పనులు చేయించినట్లు తెలిపారు. పాలకుర్తి ప్రాథమిక పాఠశాల అద్భుతంగా ఉందని హెచ్‌ఎం చిదురాల శ్రీనివాస్‌ను, ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, ఉన్నత పాఠశాల హెచ్‌ఎం శోభారాణి, టెంపుల్‌ కాలనీ హెచ్‌ఎం ఇమ్మడి అశోక్‌, ఎం.శ్రీనివాస్‌, విజయ్‌కుమార్‌, విజేందర్‌, శ్రీనివాస్‌, మంజుల, అప్రాష్‌ సూల్తానా, సుధాకర్‌, నరసింహమూర్తి, సంపత్‌ పాల్గొన్నారు.

జిల్లా విద్యాధికారి భోజన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement