ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలి

Jun 14 2025 7:35 AM | Updated on Jun 14 2025 7:43 AM

జనగామ రూరల్‌: ముస్లింలకు రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ ప్రదేశ్‌ కమిటీ ఉపాధ్యక్షుడు న్యాయవాది జమాల్‌ షరీఫ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ప్రార్థన అనంతరం జనగామలోని జామియా, ఏక్‌ మినార్‌, అజీజియా, హైదర్‌, జుబేదా మసీదుల్లో వాల్‌ పోస్టర్లు ఆవిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రభుత్వంలో 14శాతంగా ఉన్న ముస్లింలకు ఒక మంత్రి పదవి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింల ఓట్ల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గెలిచిన తరువాత తమ సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ నుంచి అమీర్‌అలీఖాన్‌ మాత్రమే ఉన్నారని, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ ముహమ్మద్‌ అన్వర్‌, ముహమ్మద్‌ ఇస్మాయిల్‌, ముహమ్మద్‌ గౌస్‌, ముహమ్మద్‌ అజారుద్దీన్‌, ముహమ్మద్‌ అలీముద్దీన్‌, ముహమ్మద్‌ బాబా, ఫరూక్‌, అకీల్‌ హమ్మద్‌, ముహమ్మద్‌ రఫీ మతీన్‌ అడ్వకేట్‌, డాక్టర్‌ రహీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement