చదువుతోనే బంగారు భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

చదువుతోనే బంగారు భవిష్యత్‌

Jun 13 2025 5:25 AM | Updated on Jun 13 2025 5:25 AM

చదువుతోనే    బంగారు భవిష్యత్‌

చదువుతోనే బంగారు భవిష్యత్‌

జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్‌

బచ్చన్నపేట: విద్యార్థులు చదువుకుంటేనే బంగారు భవిష్యత్‌ ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఆదర్శ, కస్తూర్బాగాంధీ, సెకండరీ పాఠశాలల పరిసరాలను మధ్యాహ్న వంటను పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులకు బుక్స్‌ను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక వసతులు కల్పిస్తున్నారన్నారు. విద్యార్థులు వాటిని వినియోగించుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్‌, పాఠశాల ప్రిన్సిపాళ్లు భారతీదేవి, గీత, పంచాయతీ కార్యదర్శి అనిల్‌రాజ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement