
ఔరా.. సర్కారు స్కూళ్లు
వేసవి సెలవుల తర్వాత నేడు తెరుచుకోనున్న పాఠశాలలు విద్యార్థులకు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు
మామిడి తోరణాలు.. తీరొక్కపూలు.. రంగురంగుల బొమ్మలు.. వాకిట ముగ్గులు.. వేసవి సెలవుల అనంతరం నేటి(గురువారం) నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా అలంకరించారు. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా పర్యవేక్షణలో డీఈఓ భోజన్న ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. మొదటిరోజే పిల్లలకు యూనిఫాం, నోటు, పాఠ్యపుస్తకాలు అందించేందుకు అన్నీ సిద్ధం చేశారు. జిల్లాలో 548 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, గురుకులాలు ఉండగా.. వీటిలో 45వేల పైచిలుకు విద్యార్థులు చదువుతున్నారు. ‘బడిబాట’తో సంఖ్య మరింత పెరగనుంది. – జనగామ
అలంకరణలో పాలకుర్తి పీఎస్
స్వాగత తోరణం
బచ్చన్నపేట: పడమటి కేశ్వాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్వాగతం పలికేందుకు పాఠశాలను మామిడి కొమ్మలు, స్వాగత తోరణాలతో అలంకరించారు.
మామిడి తోరణాలతో అలంకరణ
పాలకుర్తి టౌన్ : స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధాన గేటు, తరగతి గదులను కొబ్బరి మట్టలు, మామిడి తోరణాలు, బెలూన్లతో అలంకరించారు. ప్రధానోపాధ్యాయులు చిదురా ల శ్రీనివాస్ ఆధ్వర్యాన విద్యార్థులను ఆకర్షించేలా వాల్కు విద్యార్థులకు ఉపయోగపడే ఇంగ్లిష్, తెలుగు అక్షరమాల, జాతీయ నాయకులు, ప్రకృతి చిత్రాలతో తీర్చిదిద్దారు.

ఔరా.. సర్కారు స్కూళ్లు

ఔరా.. సర్కారు స్కూళ్లు