
గురువారం శ్రీ 12 శ్రీ జూన్ శ్రీ 2025
స్టేషన్ఘన్పూర్: పక్క ఫొటోలో కనిపిస్తు న్న ఉన్నత పాఠశాల శివునిపల్లిలో ఉంది. 1952లో ప్రారంభించారు. ఈ స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థుల్లో చాలా మంది ఉన్నత స్థాయికి ఎదిగారు. మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్యతో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, కోచ్లు, గెజిటెడ్ హెచ్ఎం స్థాయికి ఎదిగారు.
ప్రైవేటుకు దీటుగా..
జనగామ: ప్రైవేట్ పాఠశాలలకు కేంద్ర బిందువైన జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న గణేశ్ స్ట్రీట్ ప్రాథమి కోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతులు ఉన్నా యి. హెచ్ఎంతో 9 మంది ఉపాధ్యాయులు అంకితభావంతో విద్యాబోధన చేస్తున్నారు. దీంతో ప్రైవేట్ పాఠశాలలు ఎన్ని ఉన్నా.. గత ఏడాది 184 మంది పిల్లలు ఉండగా.. ఈసారి ‘బడిబాట’లో మరో 40 మందికి పైగా అడ్మిషన్లు పొందారు. చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, తల్లిదండ్రులతో నిర్వహిస్తున్న సమావేశాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
న్యూస్రీల్