బాలకార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

బాలకార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

Jun 12 2025 7:33 AM | Updated on Jun 12 2025 7:33 AM

బాలకార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

బాలకార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

జనగామ రూరల్‌: బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దడంతోపాటు బాలల హక్కులను పరిరక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్‌లో కార్మిక, జిల్లా సంక్షేమ శాఖలు సంయుక్త ఆధ్వర్యాన ఇందుకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. పిల్లలు ఆటపాటలతో విద్య అభ్యసించేలా చూడాలని, వారికి అనుకూలమైన విద్యావాతావరణం కల్పించాలని చెప్పారు. బాల కార్మిక వ్యవస్థతోపాటు చట్టాలపై అవగాహన కల్పించాలని, ఇందుకు సంబంధిత శాఖల అధికా రులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఫ్లోరెన్స్‌, జిల్లా సహాయ కార్మిక అధికారి కుమారస్వామి, జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, బాలల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పలయ్య, బాలల పరిరక్షణ అధికారి రవికాంత్‌, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కోఆర్డినేటర్‌ రవికుమార్‌, స్కోప్‌ ఎన్జీఓ కోఆర్డినేటర్‌ మనోజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

మోడల్‌ మార్కెట్‌ పనులు వేగవంతం చేయాలి

పట్టణంలోని దయానిలయం వద్ద నిర్మాణమవుతున్న ఇంటిగ్రెటెడ్‌ వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ పనుల ను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌తో కలిసి పనులను పరిశీలించిన ఆయన మాట్లాడారు. పట్టణ వాసుల సౌలభ్యం కోసం నిర్మాణం చేపట్టిన మోడల్‌ మార్కెట్‌ పనులను నెలరోజుల్లో పూర్తి చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. కమిషనర్‌ వెంకటేశ్వర్లు, డీఈ, ఏఈ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement