
పురాతన బడికి పూర్వ వైభవం
దేవరుప్పుల: సింగరాజుపల్లి ప్రాథమిక పాఠశాల ప్రైవే ట్ స్కూళ్ల కారణంగా విద్యార్థుల సంఖ్య తగ్గి ప్రాభవం కోల్పోయింది. ఇటీవల బదిలీపై వచ్చిన హెచ్ఎం అంబటి అంజయ్య, ఉపాధ్యాయులు గ్రామస్తుల సహకా రంతో బడికి పూర్వ వైభవం తేవడానికి గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ వంగాల మల్లారెడ్డి, ప్రస్తుతం మరో చోట పనిచేస్తున్న ఉపాధ్యాయుడు దివాకర్రెడ్డి, జీపీ భాగస్వామ్యంతో పాఠశాలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. గత ఏడాది 40 మందికి పరిమితమైన విద్యార్థుల సంఖ్య 60కి పెంచేందుకు కసరత్తు ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణం, భవన సముదాయాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు.