
సర్కారు స్కూళ్లను బతికించుకుందాం..
● జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న
జనగామ: అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చే నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలను బతికించుకునేందుకు ప్రతీ తల్లిదండ్రి ఆలోచించాలని డీఈఓ భోజన్న అన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో బుధవారం డీఈఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడా రు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మరింత నమ్మ కం పెంచేలా అంకిత భావంతో పని చేస్తామని, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులపై అదనంగా దృష్టి సారిస్తామని చెప్పారు. జిల్లాలోని ప్రతీ పాఠశాలను సందర్శించి, విద్యాబోధన విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మండల, జిల్లా స్థాయిలో ప్రణాళిక తయారు చేసి పాఠశాల వారీగా ఉపాధ్యాయుల ప్రగతి, విద్యార్థి ప్రతిభపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 125 పాఠశాలల్లో 329 ఇంట రా క్టివ్ ప్లాట్ ప్యానెల్(ఐఎఫ్ పీ) డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేశామని, ఇందులో సబెక్టుల వారీగా 543 కంటెట్లు లోడ్ చేసి ఉంటుందని వివరించారు. ప్రత్యక్ష బోధనతో పాటు డిజిటల్ ద్వారా కార్పొరేట్ స్థాయి విద్య అందించనున్నట్లు తెలిపారు. 6 నుంచి 10 తరగతులకు ఏఐ(ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) పాఠాలు సైతం కొనసాగుతున్నాయని, 1 నుంచి 5 వరకు ఎఫ్ఎల్ఎన్ ఏఎక్సల్ ద్వారా ఏఐ బోధన గత ఏడా ది నుంచే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ పాఠశాలకు స్పోర్ట్సు మెటీరియల్ అందించామని, ‘బడిబాట’ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చే స్పందన సర్కారు బడుల పనితీరుకు నిదర్శనమని వివరించారు.