ముగిసిన టెక్నోజిల్‌–2025 సంబురం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన టెక్నోజిల్‌–2025 సంబురం

Jun 12 2025 7:33 AM | Updated on Jun 12 2025 7:33 AM

ముగిస

ముగిసిన టెక్నోజిల్‌–2025 సంబురం

జనగామ: జనగామ మండలం యశ్వంతాపూర్‌ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడు రోజులుగా కొనసాగుతున్న టెక్నోజిల్‌–2025 వేడుకలు బుధవారం ముగిసాయి. చివరిరోజు సంబరా లను కళాశాల డైరెక్టర్‌ డి.విజయపాల్‌రెడ్డి ఆధ్వర్యా న నిర్వహించారు. స్లో బైక్‌రేసింగ్‌, మెహందీ, రంగో లీ, ఫేస్‌ పెయింటింగ్‌, నృత్య పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫ్యాషన్‌ షో, డీజేనైట్‌ ప్రోగ్రాం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం విజయపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఆటలతో పాటు చదువూ ముఖ్యమే అన్నారు. తల్లిదండ్రుల ఆశలను, ఆశయాలను నెరవేర్చే విధంగా సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలన్నారు. చివరలో ఆయా పోటీల్లో గెలు పొందిన విజేతలకు డైరెక్టర్‌ చేతుల మీదుగా బహుమతులు అందజేశా రు. ప్రిన్సిపాల్‌ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి, కన్వీనర్‌ ఏఎస్‌.రావు, కోకన్వీనర్‌ జి.సరిత పాల్గొన్నారు.

ఆటలు, చదువు రెండూ ముఖ్యమే :

సీజేఐటీ డైరెక్టర్‌ విజయపాల్‌రెడ్డి

ముగిసిన టెక్నోజిల్‌–2025 సంబురం1
1/1

ముగిసిన టెక్నోజిల్‌–2025 సంబురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement