చెల్క భూముల్లో పత్తి సాగు | - | Sakshi
Sakshi News home page

చెల్క భూముల్లో పత్తి సాగు

Jun 10 2025 3:22 AM | Updated on Jun 10 2025 3:44 AM

జనగామ: కొత్త టెక్నాలజీ సహకారంతో చెల్క భూముల్లో పత్తి సాగు చేసి ఉత్పాదకత పెంచేందుకు రైతులను ప్రోత్సహించడానికి కేంద్రం కొన్నేళ్లుగా నూతన స్కీంను అమలు చేస్తున్నద ని యాదాద్రి భువనగిరి ఏరువాక కేంద్రం, ప్రధాన శాస్త్రవేత్త, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ బి.అనిల్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో అధిక సాంద్ర త పత్తి సాగు ప్రాజెక్టు 2025–26 సంవత్సరంలో 500 ఎకరాల టార్గెట్‌తో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. చెల్క భూమి(ఎర్ర భూములు) ఉన్న చిన్న, సన్నకారు రైతులు 1 నుంచి 5 ఎకరాల వరకు మాత్రమే ఈ ప్రాజెక్టులో నమోదు చేసుకోవాలన్నా రు. ఎకరానికి రూ.5వేల చొప్పున సబ్సిడీ నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని తెలిపా రు. ఈ పథకం కింద రైతులు రాశి కంపెనీకి చెందిన ఆర్‌సీహెచ్‌–929, ఆర్‌సీహెచ్‌–971(స్విఫ్ట్‌) హైబ్రిడ్‌ విత్తనాలు వినియోగించే క్రమంలో మెళకువలు పాటించాలని సూచించారు. ప్రతీ వరుస మధ్యలో 90 సెంటీమీటర్ల(3 ఫీట్లు)తో పాటు మొక్కకు మధ్య 15 సెంటీమీటర్ల(సగం ఫీటు) దూరం ఉండేలా విత్తుకోవాలని తెలిపారు. ఒక ఎకరానికి 6 ప్యాకెట్ల పత్తి విత్తనాలు సరిపోతా యన్నారు. రైతులు నూజివీడు కంపెనీకి చెందిన అర్మిత, ఆద్య, సిరి, విజేత హైబ్రిడ్‌ లేదా క్రిష్టల్‌ కంపెనీకి చెందిన సీసీహెచ్‌–03, సదానంద్‌ హైబ్రిడ్‌ విత్తనాలు నాటుకునే సమయంలో సూచనలు, సలహాలు పాటిస్తే మంచి దన్నారు. ప్రతీ వరుసకు 90 సెంటీమీటర్లు (3 ఫీట్లు), మొక్క మొక్కకు మధ్య 30 సెంటీమీటర్లు(1 ఫీటు) దూరం ఉండేలా చూడాలని, ఎకరాకు 4 ప్యాకెట్ల విత్తనాలు అవసరమని పేర్కొన్నారు. పైన సూచించి న రాశి లేదా నూజివీడు లేదా క్రిష్టల్‌ కంపెనీలకు చెందిన హైబ్రిడ్‌ విత్తన ప్యాకెట్లను ఈ ప్రాజెక్టులో పేర్లను నమోదు చేసుకు న్న రైతులకు అందుబాటులో ఉంచుతా మని వివరించారు. నాగపూర్‌కు చెందిన కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ ఆధ్వర్యాన ప్రైవేట్‌, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో జిల్లాల్లోని కృషి విజ్ఞాన, ఏరువాక కేంద్రాల ద్వారా ఈ ప్రాజెక్టు నిర్వహణ కొనసాగుతుందని వివరించారు. జిల్లాలో 2023–24 సంవత్సరం పేరు నమోదు చేసుకున్న రైతులకు సాగు విస్తీర్ణం ఆధారంగా బ్యాంకు ఖాతా ల్లో సబ్సిడీ సొమ్ము జమ చేసినట్లు శాస్త్రవేత అనిల్‌కుమార్‌ చెప్పారు. రైతుల పత్తి పంట క్షేత్రానికి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు వచ్చి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఆస్తికి ఉన్న రైతులు(పేరు, ఊరు, మొబైల్‌ నంబర్‌) పూర్తి వివరాలు ఇవ్వాలని సూచించారు. మరింత సమాచారం కోసం 9989623815 / 8332970255 నంబర్లలతో సంప్రదించాలని పేర్కొన్నారు.

ఎకరాకు రూ.5వేల ప్రోత్సాహం

జిల్లాకు 500 ఎకరాల టార్గెట్‌

పత్తి ఉత్పాదకత పెంచేందుకు కేంద్ర సర్కారు పథకం

భువనగిరి ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.అనిల్‌కుమార్‌

చెల్క భూముల్లో పత్తి సాగు1
1/1

చెల్క భూముల్లో పత్తి సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement