‘భూభారతి’ని వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘భూభారతి’ని వినియోగించుకోవాలి

Jun 10 2025 3:22 AM | Updated on Jun 10 2025 3:22 AM

‘భూభారతి’ని వినియోగించుకోవాలి

‘భూభారతి’ని వినియోగించుకోవాలి

జనగామ రూరల్‌: భూభారతి సదస్సులు రైతులకు అర్థమయ్యే రీతిలో పకడ్బందీగా నిర్వహించాలని సీఎంఆర్‌ఓ ప్రాజెక్ట్‌ సీసీఎల్‌ఏ అసిస్టెంట్‌ సెక్రటరీ మంద మకరందన్‌ ఆదేశించారు. సోమవారం జనగామ మండలం యశ్వంతాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సదస్సు నిర్వహణను ఆర్డీఓ గోపిరామ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి చట్టం తీసుకొ చ్చింది రైతుల కోసమేనని, తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. దరఖాస్తులను పరిశీలిస్తూ తెలియనివి ఉంటే అధికారులను అడిగి తెలుసుకో వాలని పొరపాట్లు చేయొద్దని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ హుస్సేన్‌, ఆర్‌ఐ, డీటీ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

నష్కల్‌, తమ్మడపల్లి(ఐ)లో సదస్సులు..

చిల్పూరు/జఫర్‌గఢ్‌: చిల్పూరు మండల పరిధి నష్కల్‌ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణ, జఫర్‌గఢ్‌ మండలం తమ్మడపల్లి(ఐ) గ్రామంలో సోమవారం ఘన్‌పూర్‌ ఆర్డీఓ వెంకన్న ఆధ్వర్యాన భూ భారతి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది భూసమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి రశీదులను అందజేశారు. తహసీల్దార్‌లు సరస్వతి, శంకరయ్య, డీటీలు సదానందం, అనిల్‌బాబు ఆర్‌ఐలు పాల్గొన్నారు.

సీసీఎల్‌ఏ అసిస్టెంట్‌ సెక్రటరీ మకరందన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement