
విద్యార్థుల నమోదు పెంచమంటూ టీచర్లను తొలగిస్తారా?
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, అభ్యసనా సామర్థ్యాల ను పెంచే బాధ్యతను ఉపాధ్యాయులే వహించాలని ప్రభుత్వం చెబుతూనే.. మరో వైపు సర్దుబాటు పేరిట ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులను లేకుండా చేయడం దారుణం. సర్కారు స్కూళ్లలో విద్యార్థుల నమోదు ఏటేటా తగ్గిపోతున్నది. ఈ ఏడాది నమో దు పెంపునకు సమష్టిగా కృషి చేద్దామని చెప్పిన విద్యాశాఖ అధికారులు కనీసం ‘బడిబాట’ తర్వాత విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా సర్దుబాటు ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటి. వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయులు ‘బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థుల నమోదును పట్టించుకోకుండా ఈనెల 13 నాటికే సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడం సరికాదు.
– పి.చంద్రశేఖర్రావు, జిల్లా అధ్యక్షుడు, టీఎస్యూటీఎఫ్
‘బడిబాట’ ముగిశాకే సర్దుబాటు చేయాలి
‘బడిబాట’ ముగిశాకే ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలి. ‘బడిబాట’లో విద్యార్థుల సంఖ్య పెరిగేది లేనిది చూడకుండానే జూన్లోనే ఉపాధ్యాయుల సర్దుబాటు సహేతుకం కాదు. ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేస్తే ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో విద్యార్థులు ఎలా చేరతారు. ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు, అదనంగా ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకుని మిగిలిన ఉపాధ్యాయులను మాత్రమే జూలైలో సర్దుబాటు చేయాలి.
– డి.శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీపీటీఎఫ్

విద్యార్థుల నమోదు పెంచమంటూ టీచర్లను తొలగిస్తారా?