
మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
● వీసీలో రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క
జనగామ రూరల్: రాష్ట్రంలో కోటి మంది మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి సీఎస్ కె.రామకృష్ణారావుతో కలిసి ‘బడి బాట’, ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో మహిళా సంఘాలు పెట్రోల్ పంపు ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని, ఒక పెట్రోల్ పంపు ఏర్పాటుతో 10 కుటుంబాలు బాగుపడతాయన్నారు. నవంబర్ నాటికి నూతన ఇంది రా మహిళా శక్తి భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 12న పాఠశాలలు పునః ప్రారంభోత్స వం సందర్భంగా పండుగ వాతావరణంలో పిల్లల కు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందజేయాలని ఆదేశించారు. మహిళా సంఘాల ద్వారా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సబ్ స్టేషన్ పరిధిలో 8 ఎకరాల అనువైన భూమి 10 రోజుల్లో గుర్తించాలని చెప్పారు. వీసీలో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్, డీఆర్డీఓ, డీఈఓ పాల్గొన్నారు.