రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలి

Jun 7 2025 1:26 AM | Updated on Jun 7 2025 1:26 AM

రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలి

రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలి

జనగామ రూరల్‌: వానాకాలం సీజన్‌ ప్రారంభమైనందున తక్షణమే రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యాన శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలోని ఎస్‌బీఐ బ్యాంక్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రం బ్యాంకు మేనేజర్‌కు అందజేశా రు. ఈ సందర్భంగా చందునాయక్‌ మాట్లాడుతూ ప్రజల డిపాజిట్లు, కేంద్ర ప్రభుత్వ వాటా ధనంతో నిర్వహిస్తున్న బ్యాంకులు రిజర్వు బ్యాంక్‌ నిబంధనల ప్రకారం రైతులకు 18శాతం పంట రుణాలు, 22శాతం దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాల్సి ఉండగా అమలు చేయడంలేదన్నారు. దీంతో సీజన్‌ ప్రారంభంలో అన్నదాతలు పెట్టుబడి కోసం ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీ ప్రకారం పంట రుణాలు మాఫీ చేసి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాల ని, కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పరిమితి రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఈనెల 11న తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. రామావత్‌ మీట్యా నాయక్‌, బోడ రాములు, ఉర్సుల కుమార్‌, ఉర్సుల మల్లయ్య రామచొక్కం తదితరులు పాల్గొన్నారు.

రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చందునాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement