
‘భూ భారతి’ చట్టంతో సమస్యల పరిష్కారం
జనగామ రూరల్/రఘునాథపల్లి : నూతన ‘భూ భారతి’ చట్టంతో ప్రజల భూ సమస్యలు పరిష్కా రం అవుతాయని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ అన్నారు. శుక్రవారం జనగామ మండలం ఎల్లంల, రఘునాథపల్లి మండలం మాధారం గ్రామాల్లో నిర్వహించిన భూ భారతి రెండో దశ గ్రామ రెవెన్యూ సదస్సులను ఆయన పరిశీలించారు. సదస్సుకు హాజరైన రైతులు, ప్రజల నుంచి భూ సమస్యల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులు తీసుకుని రశీదులు తప్పనిసరి ఇవ్వాలని, చట్టాన్ని అనుసరించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 20వ తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్లు హుస్సేన్, మోహ్సిన్ముజ్తబ, ఏఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్లు, ఎంఎస్లు రవీందర్, శ్రీనివాస్రావు, నరేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్