మొక్కలతోనే మానవ మనుగడ | - | Sakshi
Sakshi News home page

మొక్కలతోనే మానవ మనుగడ

Jun 6 2025 6:13 AM | Updated on Jun 6 2025 6:13 AM

మొక్కలతోనే మానవ మనుగడ

మొక్కలతోనే మానవ మనుగడ

జనగామ రూరల్‌: మొక్కల పెంపకంతోనే వాతావరణ సమతుల్యం ఏర్పడి మానవజాతి మనుగడ సాధ్యమవుతుందని డీపీఓ స్వరూప, డీఆర్‌డీఓ వసంత అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెంబర్తిలో మొక్కలు నాటిన అనంతరం వారు మాట్లాడారు. ప్రస్తుత ప్రపంచంలో గ్లోబల్‌ వార్మింగ్‌ పెరుగుతోందని, మానవుడు అనేక వ్యర్థాలను గాలిలోకి వదడంతో వాయు కాలుష్యం ఏర్పడుతోందని చెప్పారు. దీనిని నివారించడం కేవలం మొక్కల పెంపకం వల్లే సాధ్యం అవుతుందని, ప్రతి ఒక్కరూ ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని కోరా రు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ సంపత్‌కుమార్‌, ఏపీఓ భిక్షపతి, ఈసీ మాధవరెడ్డి, పంచా యతీ కార్యదర్శి ప్రఫుల్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement