
సర్కారు స్కూళ్లలోనే నాణ్యమైన విద్య
సర్కారు స్కూళ్లలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి బంగారు భవిష్యత్కు బాటలు వేయాలి. సర్కారు స్కూళ్లలో ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, మధ్యాహ్న భోజనం అందజేస్తారు. కార్పొరేట్కు ధీటుగా డిజిటల్ తరగతులు, స్పెషల్ క్లాస్లు, సబ్జెక్టు ల వారీగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత విద్యాబోధన ఉంటుంది. ప్రైవేట్ మాయలో పడొద్దు. డబ్బులు వృథా చేసుకోవద్దు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. – భోజన్న, డీఈఓ
●