
‘భూ భారతి’తో సత్వర పరిష్కారం
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
రఘునాథపల్లి: ప్రభుత్వం అమలు చేస్తున్న ‘భూ భారతి’ చట్టంతో భూ సమస్యలకు సత్వర పరష్కా రం లభిస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం ఇబ్రహీంపూర్లో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సును పరిశీలించిన అనంత రం ఆయన హెల్ప్ డెస్క్ను సందర్శించారు. రైతులు ఏ సమస్యలపై దరఖాస్తులు ఇస్తున్నారని కలెక్టర్ అడగ్గా వారసత్వం, సాదాబైనామాపై ఎక్కువ వచ్చినట్లు తహసీల్దార్ మోహ్సిన్ముజ్తబ వివరించా రు. రైతులు భూభారతి సదస్సులను సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఐ రవీందర్, సీనియర్ అసిస్టెంట్ నరేష్, పంచాయతీ కార్యదర్శి నర్సింహ, ఎంఎస్.నరేష్, జూని యర్ అసిస్టెంట్లు ఐలమల్లయ్య, శారద, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
సుందరీకరణ పనులు ఆకర్షణీయంగా ఉండాలి
జనగామ: పట్టణ సుందరీకరణ పనులు అత్యంత ఆకర్షణీయంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. రూ.30 లక్షల నిధులతో చేపట్టిన సుందరీకరణ పనులను బుధవారం అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి పరిశీలించిన కలెక్టర్.. హనుమకొండ రోడ్డులో నిర్మిస్తున్న ఆర్చి, విద్యుదీకరణ పను ల గురించి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్–హైదరాబాద్ హైవేపై ప్రయాణించే వారికి ముఖ ద్వారం ఆకట్టుకునేలా ఉండాలన్నారు. స్వాగత తోరణంతో పాటు ప్రభు త్వ చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ మహిపాల్ సిబ్బంది ఉన్నారు.