పునర్విభజన హామీల అమలుకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

పునర్విభజన హామీల అమలుకు పోరాటం

Jun 5 2025 7:28 AM | Updated on Jun 5 2025 7:28 AM

పునర్విభజన హామీల అమలుకు పోరాటం

పునర్విభజన హామీల అమలుకు పోరాటం

నర్మెట: పునర్విభజన హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్ల్లపల్లి శ్రీనివాస్‌రావు అన్నారు. పార్టీ జిల్లా మహాసభల ముగింపు సందర్భంగా స్థానిక వినాయక గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సభాప్రాంగణంలో రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యురాలు పాతూరి సుగుణమ్మ ఎర్రజెండాను ఎగురవేసిన అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే సీహెచ్‌. రాజారెడ్డి, సహాయ కార్యదర్శులుగా ఆకుల శ్రీనివాస్‌, ఆది సాయన్నను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. విభజన చట్టంలో తెలిపిన విధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్ట రీ ఏర్పాటు చేయాలని, జనగామ నుంచి హైదరా బాద్‌ వరకు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో గుగులోత్‌ సఖి, మోతె శ్రీశైలం, చొప్పరి సోమయ్య, కావటి యాదగిరి, సముద్రాల రాజు, జువారి రమేశ్‌, జీడి ఎల్లయ్య, నీల కనకయ్య, బోనగిరి కుమారస్వామి, పాతూరి ప్రశాంత్‌రెడ్డి, చామకూర యాకూబ్‌ పాల్గొన్నారు.

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్ల్లపల్లి శ్రీనివాస్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement