
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
రఘునాథపల్లి/లింగాలఘణపురం: రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం రఘునాథపల్లి మండలం నిడిగొండ, లింగా లఘణపురం మండలం నెల్లుట్లలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన అనంతరం మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శంగా జరిగిందని, మొదటి విడతలో ఇల్లు మంజూరు కాని అర్హులు ఆందోళన చెందవద్దని, త్వరలో రెండో విడతలో వస్తుందని చెప్పారు. ‘ఎవరికీ రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు.. ఎవరైనా డబ్బులు అడిగితే నాకు తెలియచేస్తే వారి పని నేను చూసుకుంటా’ అని భరోసా ఇచ్చారు. అవినీతికి అస్కారం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, ఆర్డీఓ గోపిరాం, మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాంబాబు, ఎంపీడీఓలు గార్లపాటి శ్రీనివాసులు, జలేందర్రెడ్డి, ఎంపీఓ రఘురామకృష్ణ, తహసీల్దార్ మోహ్సిన్ముజ్తబ పాల్గొన్నారు.