విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట

Jun 5 2025 7:28 AM | Updated on Jun 5 2025 7:28 AM

విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట

విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

పాలకుర్తి టౌన్‌: సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ప్రాధాన్యత కల్పిస్తున్నదని ఎమ్మెల్యే మామి డాల యశస్వినిరెడ్డి అన్నారు. స్థానిక బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో ఉంటూ సిద్ధార్థ విద్యాలయంలో చదవి పదో తరగతిలో 557 మార్కులు సాధించి సీఎం ప్రతిభా పురస్కారం అందుకున్న విద్యార్థి ఈగ సందీప్‌ను ఆమె బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లడుతూ జిల్లా నుంచి సందీప్‌ ప్రతిభా పురస్కారాన్ని పొందడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షే మ వసతి గృహాల విద్యార్థులకు డైట్‌ చార్జీలు 40 శాతం పెంచి ప్రోహిస్తున్నదని, గ్రామీణ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యాలో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సందీప్‌ తల్లిదండ్రులతోపాటు సిద్ధార్థ విద్యాలయం ప్రిన్సిపాల్‌ జక్కుల రవీందర్‌, కరస్పారెండెంట్‌ జక్కుల ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement