ముగిసిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు

Mar 29 2023 1:42 AM | Updated on Mar 29 2023 1:42 AM

 పరీక్షలు రాసి బయటకు వస్తున్న విద్యార్థులు  - Sakshi

పరీక్షలు రాసి బయటకు వస్తున్న విద్యార్థులు

జనగామ రూరల్‌: ఈనెల 15 నుంచి ఇంటర్‌ మొద టి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కాగా మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 18 సెంటర్లలో పరీక్షలు నిర్వహించగా.. ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా జరిగాయని ఇంటర్‌ విద్యాధికారి శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం పరీక్షకు జనరల్‌ విభాగంలో 3,415 మందికి 3,326 మంది హాజరు కాగా 89మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 477మందికి గాను 436 మంది హాజరు కాగా 41మంది గైర్హాజరయ్యారు. మొ త్తంగా 3,892 మంది విద్యార్థులకు 3,762 మంది హాజరయ్యారు. జనగామ జఫర్‌గఢ్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ కళాశాలలను పరీక్షల కన్వీనర్‌ శ్రీనివాస్‌, డెక్‌ సభ్యులు లలిత, ఆంజనేయరాజు సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement