ఐదు నెలల తర్వాత పాజిటివ్ కేసు
జనగామ: జిల్లాలో ఐదు నెలల తర్వాత మంగళవారం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆరు ర్యాపిడ్ టెస్ట్లు నిర్వహించగా పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. గతేడాది అక్టోబర్ 12న కరోనా కేసులు రాగా అప్పటి నుంచి ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్న తరుణంలో 168 రోజుల తర్వాత కేసు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.